Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాహితుడితో రహస్య సంబంధం పెట్టుకునీ.. చివరకు...

వివాహితుడితో రహస్య సంబంధం పెట్టుకునీ.. చివరకు...
, బుధవారం, 17 అక్టోబరు 2018 (17:25 IST)
చిత్తూరు జిల్లాలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని కార్వేటినగరంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, కార్వేటి నగరం మండపం ఎంఎం విలాసం పంచాయతీ పరిధిలోని గుండ్రాజు ఇళ్ళకు చెందిన కె.గురుమూర్తి అనే వ్యక్తి రామకుప్పం మండలం గురుకులమడుగు ప్రాథమిక పాఠశాలల్లో ఎనిమిదేళ్లుగా టీచర్‌గా పని చేస్తున్నాడు.
 
అదే గ్రామానికి చెందిన కళావతి, చెల్లప్పనాయుడు కుమార్తె శ్రావణి(21) అతనితో చనువుగా ఉండేది. శ్రావణికి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పడమేకాకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమెను మూడు రోజుల క్రితం గురుమూర్తి కార్వేటినగరంలో అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకొచ్చాడు. 
 
శ్రావణి ఒక రోజు రాత్రంతా ఆయనతోనే ఉన్నది. ఇంతలో వారిమధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, శ్రావణి వంట గదికి గడియపెట్టి ఫ్యాన్‌ కొక్కికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క బాలకృష్ణకు మాత్రమే అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చా.. రచ్చచేసి పార్టీని చంపేయకండి : పవన్ కళ్యాణ్