Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో శాడిస్టు వడ్డీవ్యాపారి.. ‘స్పందన’ ఫిర్యాదుతో అరెస్టు

Webdunia
ఆదివారం, 8 సెప్టెంబరు 2019 (13:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్‌మనీ వడ్డీ వ్యాపారుల వేధింపులు మర్చిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరులోని కొత్తపేటలో వడ్డీ వ్యాపారం ముసుగులో సామాన్యులను వేధించుకుతింటున్న రత్నారెడ్డి అనే వ్యాపారిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఏపీ సీఎం జగన్ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఇటీవల‘స్పందన’ కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది ప్రజలు రత్నారెడ్డి వేధింపులపై పోలీసుల ముందు వాపోయారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కొత్తపేట సీఐ సుధాకర్ రెడ్డి.. సుధాకర్ అనే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రత్నారెడ్డిని అరెస్ట్ చేశారు. 
 
అనంతరం రత్నారెడ్డి కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు విస్తుపోయారు. అతని ఆఫీసు నుంచి 225 ఏటీఎం కార్డులు, రూ.1.40 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 35 పాస్ పుస్తకాలు, 102 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 293 ఖాళీ చెక్కులు, 8 పట్టాదారు పాస్ పుస్తకాలు, 20 దస్తావేజులు రత్నారెడ్డి ఆఫీసులో లభించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments