Webdunia - Bharat's app for daily news and videos

Install App

గల్ఫ్ దేశంలో పెళ్లితో ఒక్కటయ్యారు, మరి స్వదేశానికి వచ్చి ఏంటీ పని?

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (16:45 IST)
రాజంపేట మండలం బోయనపల్లె దళితవాడలో నివసిస్తున్న కత్తి సుబ్బన్న బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని రెండో కుమార్తె వాణి జీవనోపాధి కోసం ఒకటిన్నర ఏడాది క్రితం కువైట్‌కు వెళ్లింది. ఇదే విధంగా జీవనోపాధి కోసం కువైట్ వచ్చిన సుబ్రమణ్యం ఆమెకు పరిచయమయ్యాడు. సుబ్రమణ్యంది కర్నూలు జిల్లా బనగానపల్లె.
 
వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ చిగురించింది. దీంతో వీరిద్దరూ అక్కడే వివాహం చేసుకున్నారు. ప్రస్తుతానికి సంతానం లేదు. మూడు నెలల క్రితం వీరు కువైట్‌ నుండి నేరుగా బోయనపల్లెకు వెళ్లి తమవారిని కలుసుకున్నారు. వీరు వచ్చాక కుటుంబంలో భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, కుటుంబ కలహాలు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు.
 
ఈ పరిస్థితులలో వీరు ఇంటి నుంచి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని బుధవారం కడప శివారులోని కనుమలోపల్లె రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో బంధువులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు. విచారణలో ఆమె తండ్రి సుబ్బన్న ఆత్మహత్యకు గల కారణలు తెలపడానికి ఇష్టపడలేదు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments