Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగురుపాటి జయరాం హత్య కేసులో ట్విస్ట్... తెరపైకి శిఖా ప్రియుడు

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (16:40 IST)
కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి ప్రియుడు సంతోష్ పేరు తెరపైకి వచ్చింది. ఇపుడు ఈ సంతోష్ ఎవరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
జయరామ్ అమెరికా పౌరుడు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో రోజుకు ఓ కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. జయరామ్ హత్య జరిగిన రోజు శిఖా చౌదరి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినట్లు పోలీసులు విచారణలో తేలింది. సంతోష్ అనే యువకుడితో ఆమె లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినట్లు నిర్ధారించారు. దీంతో ఈ కేసులో సంతోష్‌ ఎవరనే విషయాన్నికూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
కాగా, ఈ కేసులో ఇప్పటికే కుత్బుల్లాపూర్‌ రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, జయరాం హత్య తర్వాత యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని ఓ పోలీసు అధికారులు సలహా ఇచ్చారు. వీరిని ఇప్పటికే విచారించారు. మరోసారి ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాసులను పోలీసులు విచారించనున్నారు. ఇదిలావుంటే జయరామ్‌ హత్యకు నెలరోజుల ముందు చింతల్‌లో రూ.100 కోట్ల విలువైన డాక్యుమెంటేషన్ రాకేష్ రెడ్డిచేయించినట్లు గుర్తించారు. డాక్యుమెంట్‌ తయారీదారుల నుంచి వివరాలు పోలీసులు సేకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల

హీరోయిన్ రష్మిక మందన్నా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

విక్రమ్ కొత్త చిత్రం విడుదలకు ఉన్న చిక్కులేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments