Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడివాడ క్యాసినో అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (17:14 IST)
సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గమైన గుడివాడలో  నిర్వహించిన గోవా క్యాసినో వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ గురువారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది.
 
ఇదే అంశంపై ఆ పార్టీ  సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ, క్యాసినో నిర్వహణ అంశంపై డీజీపీ, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికే కాదు ప్రభుత్వ అధికారులకు కూడా చెవులు, కళ్లు పని చేయడం లేదన్నారు. 
 
మంత్రి కొడాలి నానిని రక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా అధికార యంత్రాంగం మొత్తం తపనపడుతున్నారని, ఇక చేసేది లేక తాము గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అయితే, గవర్నర్ అనారోగ్యంగా ఉండటంతో ఆయన కార్యదర్శి సిసోడియాకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. 
 
సంక్రాంతి తర్వాత కొడాలి నాని కాస్త క్యాసినో నానిగా మారారన్నారు. రూ.10 వేలు ఫీజుతో క్యాసినో ఏర్పాటు చేశారని చెప్పారు. తద్వారా రాష్ట్రంలో విష సంస్కృతికి తెరలేపారని చెప్పారు. గుడివాడలో జరిగిన గోవా క్యాసినో ప్రపంచం మొత్తం చూసినా సీఎ జగన్‌తో పాటు.. వైకాపా నేతలు చూడలేక పోవడంతో విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments