పాలపుంతలో వింత వస్తువు.. ప్రతి 18.18 నిమిషాలకు..?

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (16:59 IST)
Milky Way
పాలపుంతలో ఓ వింత వస్తువును శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతి 18.18 నిమిషాలకు ఓ రేడియో సిగ్నల్‌ను అది భూమికి పంపిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తానూ మొదట ఆ సిగ్నళ్లు ఏలియన్స్ పనేనని అనుకున్నానని నటాషా హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త తెలిపారు. 
 
అంతా విశ్లేషించాక ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు రకరకాల తరంగదైర్ఘ్యాలతో ఉన్నాయని నటాషా వెల్లడించారు. కాబట్టి అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని, సహజంగా వస్తున్నవేనని అన్నారు.
 
ఇకపోతే.. డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా ఓ విద్యార్థి మొదట దానిని గుర్తించాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ అర్రేలో టెలిస్కోప్ సాయంతో ఆ విద్యార్థి దీనిని గుర్తించాడు. దానిని ప్రస్తుతానికి "అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్" అని పిలుస్తున్నారు.
 
ప్రస్తుతం అది భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో వుంది. చాలా కాంతిమంతంగా..  అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎప్పటి నుంచో అది పాలపుంతలో ఉండి ఉండవచ్చునని, అయితే, ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయారని చెప్తున్నారు. అంతరిక్షం నుండి వచ్చే శక్తివంతమైన, స్థిరమైన రేడియో సిగ్నల్‌ను వేరే ఏదైనా జీవ రూపం ద్వారా పంపారా అనే ప్రశ్నపై ఆయన అంగీకారం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments