Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడూ మనిషేనా : ఇద్దరు బామ్మలను నరికి చంపేశాడు...

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (12:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కసాయి ఇద్దరు బామ్మలను నరికి చంపేశాడు. కేవలం విసిగిస్తుందన్న కారణంతో క్షణికావేశంలో బామ్మతో పాటు అడ్డొచ్చిన నానమ్మను కూడా హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పూడూరు మండలం చన్‌గోముల్ గ్రామానికి చెందిన శివకుమార్ మంగళవారం ఈనెల 11వ తేదీన తెల్లవారుజామున తన సొంత నానమ్మ బుచ్చమ్మను కొడవలితో నరికి చంపాడు. ఆ తర్వాత చిన్న తాతయ్య భార్య అంతమ్మపై అదే కొడవలితో దాడి చేశాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అంతమ్మను వికారాబాద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments