Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ హత్య చేసిన డ్రైవర్ భార్యకు ప్రభుత్వ కొలువు

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (09:21 IST)
ఇటీవల కాకినాడలో అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి మృతుని ఇంటపడేశాడు. ఈ హత్య కేసు సంచలనంగా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి మూడు రోజుల తర్వాత తాపీగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కోర్టు జ్యూడీషియల్ రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి జైలుల్లో ఉన్నాడు. 
 
అయితే, మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇస్తూ కలెక్టర్‌ కృతికా శుక్లా నియామకపత్రాన్ని సోమవారం అందజేశారు. అపర్ణ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంహెచ్‌వో హనుమంతురావుకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments