Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 15 వరకు రోజుకు 10 వేల సర్వదర్శనం టిక్కెట్లు

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (13:41 IST)
ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనంలో భాగంగా స్లాట్‌ సర్వదర్శనం టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఫిబ్రవరి 15 వరకు రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను విడుదల చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీవరకు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనార్థం టోకెన్లు మాత్రమే జారీచేస్తున్నామని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్‌ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలోనే ఆఫ్‌లైన్‌ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే.. శ్రీ వేంకటేశ్వ రస్వామి దర్శనం కోసం ఫిబ్రవరికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేయగా భక్తులు నిమిషాల్లోనే బుక్‌ చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో రోజుకి 12,000 చొప్పున టికెట్లను విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments