Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 15 వరకు రోజుకు 10 వేల సర్వదర్శనం టిక్కెట్లు

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (13:41 IST)
ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనంలో భాగంగా స్లాట్‌ సర్వదర్శనం టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఫిబ్రవరి 15 వరకు రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టికెట్లను విడుదల చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీవరకు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనార్థం టోకెన్లు మాత్రమే జారీచేస్తున్నామని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
ఫిబ్రవరి 15వ తేదీ నాటికి ఒమిక్రాన్‌ తీవ్రత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలోనే ఆఫ్‌లైన్‌ ద్వారా దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే.. శ్రీ వేంకటేశ్వ రస్వామి దర్శనం కోసం ఫిబ్రవరికి సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేయగా భక్తులు నిమిషాల్లోనే బుక్‌ చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో రోజుకి 12,000 చొప్పున టికెట్లను విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments