రూపాయి ఖర్చులేదు.. ఉచితంగా బోరు బావుల తవ్వకం.. రైతులకు పండుగే

Webdunia
శనివారం, 4 జులై 2020 (13:53 IST)
ఏపీలో వైకాపా సర్కారుకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో సీఎం జగన్ రెడ్డి రైతులకు వరాల వర్షం కురిపిస్తున్నారు. రైతుల కోసం మరిన్ని హామీల అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నవరత్న హామీల్లో భాగంగా రాష్ట్రంలో ఉచిత బోరు బావుల తవ్వకానికి ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా సరే... తమకు ఉచితంగా బోరు బావి కావాలని అనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
వైఎస్‌‍ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా ఈ ప్రయోజనం కలుగుతుందని సీఎం ప్రకటించారు. రూపాయి ఖర్చులేకుండా అర్హత పొందిన రైతులు... బోరుబావిని తవ్వించుకొని ప్రతి ఎకరాన్నీ పండించాలన్నదే జగన్ సర్కారు ఆశయం.  
 
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
* గ్రామ సచివాలయంలో ఇంటర్నెట్‌లో దరఖాస్తు ఫారంను పూర్తి చేయాలి. పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ ఫొటో, ఆధార్ కార్డు జిరాక్స్‌ ఫొటోను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అప్లికేషన్లను పరిశీలించాక... అధికారుల నుంచి అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత డ్రిల్లింగ్ కాంట్రాక్టర్, భూ పరిశోధకులు వచ్చి... ఎక్కడ నీరు ఉందో చెక్ చేస్తారు. నీరు ఉన్న చోట బోరు బావిని తవ్వి, పని పూర్తి చేస్తారు.
 
* 5 ఎకరాల దాకా భూమి ఉండి, బోరు బావి లేనివారు. 
* కనీసం 2.5 ఎకరాల భూమి కలిగినవారు.
* ఇద్దరు, ముగ్గురు రైతులు కలిసి కూడా అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhatti Vikramarkaఫ యువతరం ఎలా ఎదగాలనే సందేశంతో పిఠాపురంలో చిత్రం : భట్టి విక్రమార్క

చాందినీ గాయంతో కాలు నొప్పి ఉన్నా డాకూ మహారాజ్ లో పరుగెత్తే సీన్స్ చేసింది : బాబీ

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments