గోవిందరాజస్వామి ఆలయ కిరీటాలను ఎలా చేశాడో చూడండి

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (22:02 IST)
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో కనిపించకుండా పోయిన మూడు కిరీటాలను దొంగిలించిన దొంగను తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 80 రోజుల పాటు నిర్విరామంగా కష్టపడి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
 
నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖాందార్ తాలూకా స్వప్నభూమ్ నగర్‌కు చెందిన ఆకాష్ ప్రతాప్ సరోడిగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మూడు కిరీటాలను కరిగించి బంగారుముద్దలా తయారుచేశాడు. వాటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ తిరుపతిలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. 
 
మూడు కిరీటాల విలువ 42 లక్షల 35 వేల 385 రూపాయలు విలువ ఉంటుందని, ఫిబ్రవరి 2వ తేదీ నిందితుడు కిరీటాలను దొంగిలించారని ఎస్పీ తెలిపారు. నిందితుడిని సి.సి. కెమెరా ఆధారంగా గుర్తించామన్నారు. 78 సి.సి. కెమెరాల్లో నిందితుడి కదలికలు రికార్డ్ అయ్యాయని, 40 మంది పోలీసులు 80 రోజుల పాటు కష్టపడి నిందితుడిని పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడు దొంగతనం చేసిన తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల కనిపెట్టడం కష్టమైందన్నారు ఎస్పీ అన్బురాజన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments