Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోటు కిందే కుప్పలుతెప్పలుగా మృతదేహాలు? బయటకు తీయడం సాధ్యమా..?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (17:36 IST)
పాపికొండల్లో మునిగిపోయిన బోటును బయటకు తీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఎన్డీఆర్ ఎఫ్‌ బలగాలు. ఇప్పటికీ 34 మంది ఆచూకీ లభ్యం కాలేదు. మూడురోజుల క్రితం బోటు బోల్తా పడితే 60 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మొదటి రోజు 8 మృతదేహాలను బయటకు తీశారు. మొత్తం 73మంది బోటులో ప్రయాణిస్తున్నారు. 
 
రెండు అంతస్తులుగా బోటు ఉండడంతో జనం ఎక్కువమంది ఎక్కేశారు. అయితే గజఈతగాళ్ళు కూడా 5 మంది ఉన్నారు. కానీ జనం ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. పాపికొండల నడుమ గోదారిలో బోటు మునిగిన సమయంలో బలంగా అలలను ఢీకొనడంతో బోటు 321 అడుగుల లోతులోకి వెళ్ళిపోయినట్లు భావిస్తున్నారు.
 
పాపికొండల ప్రాంతంలో గోదారి లోతుగా ఉండడం.. గల్లంతైనవారంతా బోటు కింద చిక్కుకున్న ప్రాణాలు విడిచారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలకు బయటకు తీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

తమ వారి కోసం బంధువులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏదైనా మిరాకిల్ జరిగి సురక్షితంగా తమ వారు బయటపడతారేమోనని దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు బంధువులు. అయితే మూడురోజుల క్రితం మునిగిపోయిన బోటులోని జనం సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం ఏ మాత్రం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments