Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.. 5 నిమిషాలకే 'ధడేల్'మంటూ సౌండ్... బోటు బోల్తా(Video)

సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.. 5 నిమిషాలకే 'ధడేల్'మంటూ సౌండ్... బోటు బోల్తా(Video)
, సోమవారం, 16 సెప్టెంబరు 2019 (19:37 IST)
పాపికొండలు...ఎవరైనా సరే ఈ ప్రాంతాన్ని చూడాలనుకుంటారు. ఎందుకంటే అద్భుతమైన ప్రాంతం. చుట్టూ కొండలు. మధ్యలో బోటు షికారు. ఇలా ఉంటే ఎవరైనా సరే వెళ్ళకమానరు. అయితే ఆ బోటు షికార్ కాస్త 60కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 
 
తెలంగాణా, ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు చెందిన 73మంది బోటులో ప్రయాణీస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 12గంటల 30నిమిషాలకు ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో బోటు అలలకు కొట్టుకుని బోల్తా పడింది. 26మంది సురక్షితంగా బయటపడ్డారు. 8మంది చనిపోయారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ప్రమాదానికి 5 నిమిషాలు ముందు... 
 
అయితే బోటు బోల్తా పడక ముందు సరిగ్గా 5నిమిషాల ముందు ఒక యువకుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వీడియో తీసుకున్న తరువాత బోటు బోల్తా పడింది. ఆ సెల్ ఫోన్ ను ఎన్డీఆర్ ఎఫ్‌ బృందాలు బయటకు తీశారు. సెల్ ఫోన్ మునిగిపోయింది కానీ అందులో ఉన్న మెమొరీ మాత్రం అలాగే ఉంది. దీంతో చివరి నిమిషంలో రికార్డ్ అయిన వీడియో చూస్తే అందరినీ బాధిస్తుంది.
 
బోటులో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ 73మంది ప్రయాణీస్తున్నారు. 5మంది గజ ఈతగాళ్ళు కూడా అందులో ఉన్నారు. వాళ్ళు కూడా అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేశారు. కానీ విధి వైపరీత్యం చివరకు ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్ లో వెల్లివిరిసిన సౌభ్రాతృత్వం