Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

ఐవీఆర్
సోమవారం, 31 మార్చి 2025 (19:11 IST)
తన ప్రియుడు చేసిన మోసానికి ఆ ప్రియురాలు ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం అంటూ కబుర్లు చెప్పిన తన ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకుని మోసం చేయడాన్ని సహించలేకపోయింది. ఆగ్రహంతో అతడు కొనుక్కున్న కొత్త బైకుపై పెట్రోల్ పోసి తగులబెట్టి బుగ్గి చేసింది.
 
పూర్తి వివరాలు చూస్తే... విశాఖపట్టణం టూటౌన్ పోలీసు స్టేషను పరిధిలో మూడేళ్ల క్రితం ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు యువకుడు. ఐతే ఏడాది గడిచాక మరో యువతిని పెళ్లి చేసుకుని ప్రియురాలికి షాకిచ్చాడు. దాంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది.

ఇటీవలే అతడు కొనుక్కున్న బైకుకి నిప్పు పెట్టి తన ఆగ్రహాన్ని తెలిపింది. అతడు బైకుకి నిప్పు పెడితే... దాని పక్కనే వున్న మరో 14 వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులకు సమాచారం అందటంతో నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments