Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను పశువుల పాకలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం...

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (11:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలోని కృత్తివెన్ను మండలంలోని ఓ పంచాయతీ పరిధిలో జరిగింది. 
 
స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 14 ఏళ్ల బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. అదేప్రాంతానికి చెందిన వివాహితుడైన పి.అనంతబాబు, జి.తరుణ్‌తోపాటు ఓ బాలుడు కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
గురువారం రాత్రి తమ ఇంటి సమీపంలోని పశువుల పాకలోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి బంటుమిల్లి ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ కోర్టుకు అప్పగించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను మచిలీపట్టణం జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments