పాడేరు, అరకులో గెలిచేది వైకాపానే: గిడ్డి ఈశ్వరి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన గిడ్డి ఈశ్వరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సైకిలెక్కినా వైకాపా గురించే ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో పాడేరు, అరకు నియోజ

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (13:01 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన గిడ్డి ఈశ్వరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సైకిలెక్కినా వైకాపా గురించే ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది.

అలాగే, 2019లో కూడా పాడేరు, అరకులో వైకాపానే గెలుస్తుందన్నారు. దీంతో పక్కనున్న నేతలంతా నోరెళ్లబెట్టారు. కచ్చితంగా రాష్ట్రమంతా ఏం జరుగుతుందో తనకు తెలియదు కానీ.. పాడేరు, అరకులో మాత్రం డ్యామ్ ష్యూర్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని గిడ్డి ఈశ్వరి చెప్పారు. 
 
పాడేరు, అరకులో వైకాపా పాతుకుపోయిందని.. అందుకు తాను కూడా కారణమేనని తెలిపారు. ఆపై వైకాపా చీఫ్ జగన్‌పై గిడ్డి ఈశ్వరి విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీని వీడుతున్నందుకు బాధపడుతున్నానని, ఆత్మాభిమానం చంపుకొని టీడీపీలో చేరుతున్నానన్నారు. జగన్‌తో విసిగిపోయానని గిడ్డి తెలిపారు. 
 
కాగా, ఈశ్వరి పార్టీ మారడానికి ప్రధాన కారణం అరకు వైసీపీ ఇంఛార్జ్ ఎంపికేనని తెలుస్తోంది. ఈశ్వరి అరకు వైసీపీ ఇంఛార్జ్‌గా ఓ పేరును ప్రతిపాదించగా వైసీపీ అధిష్టానం కుంభా రవిబాబును ఇంఛార్జ్‌గా నియమించారు. దీంతో అసంతృప్తికి లోనైన గిడ్డి ఈశ్వరి.. ఆ పార్టీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments