Webdunia - Bharat's app for daily news and videos

Install App

#VizagGasLeak : నాడు హిందుస్థాన్ పాలీమర్స్... నేడు ఎల్జీ పాలీమర్స్ ప్లాంట్...

Webdunia
గురువారం, 7 మే 2020 (12:19 IST)
విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు లీకై పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ దుర్ఘటనకు కారణమైన ఈ కంపెనీ మూలాలను ఓ సారి పరిశీలిస్తే, 
 
* ఎల్జీ పాలీమర్స్ ప్లాంట్‌ సౌత్ కొరియాకు చెందిన కంపెనీ. 
* ఇందులో ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్స్, కప్స్, కట్లరీ, మేకప్, కాస్మాటిక్ వస్తువుల నిల్వచేసే కంటైనర్లను తయారు చేస్తారు. 
* స్టెరిన్ అనే ముడి సరుకును ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. స్టెరిన్‌కు మండే స్వభావం అధికం. ఇది పేలుడుకు గురైతే విషపూరితమైన వాయువును విడుదల చేస్తుంది. 
* నిజానికి ఈ కంపెనీని 1961లో హిందుస్థాన్ పాలిమర్స్ పేరుతో ఏర్పాటు చేయగా, అపుడు పాలీస్ట్రైన్, కో-పాలిమర్స్‌ను ఉత్పత్తి చేసేవారు. 
* 1978లో ఈ కంపెనీ యూబీ గ్రూపునకు చెందిన మెక్ డొవెల్ అండ్ కో లో విలీనమైంది. 
* 1997లో సౌత్ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్ దీన్ని కైవసం చేసుకుని ఎల్జీ పాలీమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌గా పేరుమార్చారు. 
* దక్షిణ కొరియాలో ఈ కంపెనీ వ్యాపార లావాదేవీలు అధికం. 
* భారత్‌లో పాలీస్ట్రైన్ విస్తరణ చర్యల్లో ఈ కంపెనీ ప్రధానపాత్రను పోషిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Brahmanandam: హాస్యనటుడు వృత్తి నిజంగా పవిత్రమైనది : బ్రహ్మానందం

Rashmika : సక్సెస్ క్వీన్ గా మారిన నేషనల్ క్రష్ రశ్మిక మందన్న

Ram: రామ్ పోతినేని 22వ చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ కేసు.. చేధించిన పోలీసులు

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments