Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్‌ ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే రూ.5 లక్షల బీమా : జేసీ మార్కండేయులు

Webdunia
గురువారం, 4 జులై 2019 (10:02 IST)
తిరుపతి ఎల్‌పీజీ సిలెండర్‌ను వినియోగించే ప్రతి వినియోగదారుడికి ఎల్‌పీజీ ప్రమాద బీమా రక్షణ పాలసీ అందుబాటులో ఉంటుందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ మార్కండేయులు పేర్కొన్నారు. 
 
గురువారం జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఆధ్వర్యంలో రూపొందించిన 'గ్యాస్‌ సిలెండర్‌ వినియోగదారుల బీమా రక్షణ.. గ్యాస్‌ వాడకంలో భద్రతా సూచనలు' అనే కరపత్రాల్ని జేసీ ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గృహ గ్యాస్‌ వినియోగంలో ప్రమాదం జరిగితే ప్రతి వ్యక్తికి వైద్య ఖర్చులకు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు బీమా సొమ్ము పొందవచ్చని తెలిపారు. ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే రూ.5 లక్షల బీమా వస్తుందని వెల్లడించారు. 
 
ఎల్‌పీజీ వినియోగదారులు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎల్‌పీజీ డీలర్‌కు, అగ్ని ప్రమాద అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదును అందజేసి ప్రాంతీయ బీమా కార్యాలయం ద్వారా సహాయాన్ని పొందొచ్చని తెలిపారు. 
 
దీనిపై ప్రజాసంఘాలు, సామాజిక సంస్థలు ప్రజలను చైతన్యం వంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పి.రాజారెడ్డి, కార్యదర్శి ఎం.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌, ఎస్‌.రామారావు, ఎన్‌.శేషాద్రి, ఉషాదేవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments