Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మీడియా సృష్టే : గంటా శ్రీనివాస రావు

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (15:28 IST)
రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మీడియా సృష్టేనని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ముందు, ఆ తర్వాత పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతూనే వుందన్నారు. 
 
తనను నిరంతరం వార్తల్లో వుంచుతున్న మీడియాకు కృతజ్ఞతలు. నేను నరేంద్రమోడీతో కలిసి తీసుకున్న ఫోటో నిజమే. అది మోడీ గుజరత్ సిఎంగా ఉన్నపుడు తీసిన ఫోటో. నేను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వున్నప్పటిది. దానిని ఇప్పుడు వైరల్ చేశారని చెప్పారు. 
 
ఇప్పటికే నాలుగైదు ముహూర్తాలు మీరే పెట్టేశారు.... నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు చెప్తానని అనేకసార్లు స్పష్టం చేశాను. ఫంక్షన్లలో ఇతర పార్టీల వ్యక్తులను కలుస్తుంటాం. వాటిని రాజకీయాలతో ముడిపెట్టలేం. 
 
అమిత్ షా గురించి పవన్ చేసిన కామెంట్స్.... బీజేపీ మంచిది అన్నాడో.... బీజేపీకి దగ్గర అవ్వాలని అన్నాడో ఆయననే అడగాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉత్తర నియోజకవర్గానికి ఎంత చేయగలనో, అంతే చేస్తున్నా అని గంటా శ్రీనివాస రావు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments