Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూళ్లూరుపేట రైల్వే స్టేషనులో ప్రేమికులపై దాడి... యువతిపై గ్యాంగ్ రేప్...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:55 IST)
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మరో ఘాతుకం. స్త్రీని వివస్త్ర చేసి ఐదుగురు అత్యాచారం చేసారు. సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌లో రాత్రి ఈ ఘటన జరిగింది. ఏకాంతంగా రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రేమ జంటపై దాడి చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే కాకినాడకు చెందిన యువకుడు... బాధితురాలు శ్రీసిటీలో ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. 
 
కొంతకాలంగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఊరికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌లో బోకారో ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీ ఎక్కేందుకు ఒకటవ నంబర్ ప్లాట్‌ఫారమ్ చివరన ఉన్న బెంచీపై కూర్చున్నారు. అటుగా వెళ్తున్న కామాంధుల కన్ను వారిపై పడింది. ప్లాట్‌ఫారమ్ నిర్మానుష్యంగా ఉండటంతో వారు చెలరేగిపోయారు. యువకుడిపై దాడి చేసి యువతిని లాక్కుని వెళ్లారు. 
 
బాధితురాలు కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా కనికరించకుండా తీసుకువెళ్లి వివస్త్రను చేసారు. రైలు పట్టాల వెంబడి కొట్టుకుంటూ వెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుడు, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు. పరారీలో ఉన్న ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నారు. తీవ్ర రక్త స్రావం అయి అల్లాడుతున్న యువతిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు విజయనగరం జిల్లావాసిగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం