Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూళ్లూరుపేట రైల్వే స్టేషనులో ప్రేమికులపై దాడి... యువతిపై గ్యాంగ్ రేప్...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:55 IST)
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మరో ఘాతుకం. స్త్రీని వివస్త్ర చేసి ఐదుగురు అత్యాచారం చేసారు. సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌లో రాత్రి ఈ ఘటన జరిగింది. ఏకాంతంగా రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రేమ జంటపై దాడి చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే కాకినాడకు చెందిన యువకుడు... బాధితురాలు శ్రీసిటీలో ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. 
 
కొంతకాలంగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఊరికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌లో బోకారో ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీ ఎక్కేందుకు ఒకటవ నంబర్ ప్లాట్‌ఫారమ్ చివరన ఉన్న బెంచీపై కూర్చున్నారు. అటుగా వెళ్తున్న కామాంధుల కన్ను వారిపై పడింది. ప్లాట్‌ఫారమ్ నిర్మానుష్యంగా ఉండటంతో వారు చెలరేగిపోయారు. యువకుడిపై దాడి చేసి యువతిని లాక్కుని వెళ్లారు. 
 
బాధితురాలు కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినా కనికరించకుండా తీసుకువెళ్లి వివస్త్రను చేసారు. రైలు పట్టాల వెంబడి కొట్టుకుంటూ వెళ్లారు. ఒకరి తర్వాత ఒకరు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుడు, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు. పరారీలో ఉన్న ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నారు. తీవ్ర రక్త స్రావం అయి అల్లాడుతున్న యువతిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు విజయనగరం జిల్లావాసిగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం