Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి : గల్లా జయదేవ్

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (14:57 IST)
వైకాపా అరాచక పాలనకు మున్సిపల్‌ ఎన్నికల నుంచి చరమగీతం పాడాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరంతో పాటు తెనాలి మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థుల తరపున మంగళవారం జయదేవ్‌ ప్రచారం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలను ప్రజలంతా చూశారని, వాటిని అడ్డుకోవాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని కోరారు. 
 
వైకాపా దౌర్జన్యాలను అడ్డుకునే శక్తి తెదేపాకు మాత్రమే ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. 
 
తెనాలిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇస్త్రీ బండి వద్ద కాసేపు దుస్తులు ఇస్త్రీ చేశారు. వెల్డింగ్‌ షాపు వద్ద కార్మికులతో మాట్లాడారు. జయదేవ్‌తో పాటు గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జి నసీర్‌ అహ్మద్‌, తెనాలి ఇన్‌ఛార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments