Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై ఒకటో తేదీన కొత్త పింఛన్ల మంజూరు లేనట్టే

Webdunia
బుధవారం, 29 జూన్ 2022 (10:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ పింఛను కానుక కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జులై 1వ తేదీన కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సివుంది. కానీ ఈ దఫా ఆ పరిస్థితి కనిపించడం లేదు. వీరికి జులై 19న మంజూరు పత్రాలు ఇస్తామని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) సీఈవో ఇంతియాజ్‌ తెలిపారు. 
 
ఈ పత్రాలను అదేరోజు ఇస్తారా లేక మరో రోజు ఇస్తారా అన్నది స్పష్టత లేదు. దీంతో దాదాపు 3 లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. ఏడాదికి రెండు విడతల్లో ఆరు నెలలకొకసారి (జులై, జనవరి) కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం ఈ ఏడాది జనవరిలో కొత్త పింఛన్లను మంజూరు చేసింది. 
 
అప్పటి నుంచి జూన్‌ వరకు దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. వాటిని ఇప్పటికే రెండు విడతలుగా తనిఖీ చేసి దాదాపుగా 3 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్నా వివిధ కారణాలతో లబ్ధి అందని వారికి జులై 19న ఆ సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగా మంజూరు పత్రాలు అందిస్తామని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments