Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలకు ఉచిత కళ్లజోళ్లు

Webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (09:45 IST)
రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు పథకం ద్వారా సుమారు కోటిన్నర మంది పేదలకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణి చేయనుంది. ఇందుకోసం రూ.250 కోట్ల వరకు ఖర్చుచేస్తోంది. మరో 8లక్షల మందికి క్యాటరాక్ట్, ఇతర శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు.

కంటి వెలుగు పథకం అమలు కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రూ.500 కోట్లను కేటాయించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 2022 జనవరి 31 వరకు 6 దశల్లో ఈ పథకం.. కార్యక్రమాలు జరిగేలా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు చేసింది. ఒక్కో కిట్ వ్యయం రూ.150 తొలి, రెండు దశల్లో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 70 లక్షల మందికి కంటి పరిక్షలు నిర్వహిస్తారు.

ఈ క్రమంలో నిర్ధేశిత చార్టులోని అక్షరాలను 10 అడుగుల దూరం నుంచి వారి చేత చదివిస్తారు. ఇందుకోసం ప్రతి పాఠశాలలో టార్చ్​​లైట్, చార్టు, టేపును కిట్ రూపంలో పంపిణీ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.ఒక్కో కిట్​కు రూ 150 వరకు ఖర్చుపెడుతున్నారు.

మూడు నుంచి ఆరు దశల్లో సుమారు 4 కోట్ల మందికి కంటి పరిక్షలు జరుపుతారు. అవసరమైన వారికి శస్త్ర చికిత్సల చేపడతారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శస్త్ర చికిత్సలు చేసిన సంస్థలకు చెల్లింపులు జరుగుతాయి. డయాబటిక్, రెటినోపతి, చైల్డ్​హుడ్​, బ్లైండ్​నెస్ గ్లకోమా కేసులకు రూ.2 వేల చొప్పున చెల్లించనున్నారు.

అంధత్వంలో 80శాతం సమస్యలకు ముందస్తు పరిక్షలు ద్వారా తగ్గించవచ్చని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.ఈ పథకం అమలులో భాగంగా తాత్కాలికంగా 400 ఆప్తమాలిక్ అసిస్టెంట్ నియామకాలు చెపట్టపోతున్నామని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments