తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉచితంగా నిత్యావసర సరుకులు

ఐవీఆర్
బుధవారం, 29 అక్టోబరు 2025 (11:42 IST)
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో సత్వర సహాయ చర్యలను ప్రారంభించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ప్రభావిత ప్రాంతాలలో వున్న ప్రజలకు ఉచితంగా నిత్యావసర సరుకులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రతి బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఒక లీటర్ నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు, చక్కెర కిలో ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈ సరుకులన్నిటినీ వెంటనే పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనురుకి ఆదేశాలు జారీ చేసారు. 
 
కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో మొంథా తుఫాను తీరం దాటింది. ఈ తుఫాను ధాటికి 100 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. ఇంకా అలల ఉధృతి భారీగా వుంది. అలాగే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేగవంతమైన గాలుల కారణంగా విద్యుత్, రైల్వే మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోయాయి. పంటలు నీటమునిగాయి. పలువురు నిరాశ్రయులైనారు. ఈ తుఫాను ఇప్పటివరకు నలుగురు ప్రాణాలను బలిగొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments