Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం.. అలాంటిది నా చేతుల మీదుగానే.. : ప్రణబ్ ఆత్మకథ

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (08:31 IST)
కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరుగడించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ "మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ : 2012-2017" పేరుతో ఆత్మకథను రాశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆయన తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను పూర్తి వ్యతిరేకమని అందులో పేర్కొన్నారు. కానీ, చివరకు తన చేతుల మీదుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఊహించలేకపోయినట్టు చెప్పుకొచ్చారు. 
 
కాగా, ఈ పుస్తకంలోని పలు విషయాలు బయటకు వచ్చి సంచలనం సృష్టించాయి. తాజాగా, తెలంగాణ గురించి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం మరోమారు సంచలనమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడకపోగా, మరింత దారుణంగా తయారైందని ప్రణబ్ ఆవేదన వ్యక్తం చేశారు.
 
కాంగ్రెస్‌కు ప్రతికూల వాతావరణం ఏర్పడి మరింత క్షీణించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌కు అత్యంత బలమైన రాష్ట్రమని, గతంలో అక్కడ కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు లభించాయని గుర్తు చేశారు. పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రాల్లో ఓడిపోవడం వల్లే అధికారానికి దూరమైందన్నారు.
 
2014 సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని తాను భావించానని ప్రణబ్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. బీజేపీకి గరిష్టంగా 200 స్థానాలు వచ్చి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని భావించానని రాసుకొచ్చారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా ఓటమి పాలవడంతో ఆ ప్రభావం ఫలితాలపై పడిందన్నారు. 
 
పార్టీని నడిపించడంలో సోనియాగాంధీ వైఫల్యమే ఆ పరిస్థితులకు కారణమన్న ప్రణబ్.. తాను రాష్ట్రపతి అయిన తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరిలో మార్పు వచ్చిందని ప్రణబ్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని బలమైన నేతగాను, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను విధేయుడుగా ప్రణబ్ ముఖర్జీ అభివర్ణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments