Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు: ఏ1 నిందితుడు అరెస్టు

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (08:25 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసును ఆ రాష్ట్ర పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. ఈ కిడ్నాప్ బోయిన్‌పల్లిలో జరిగింది. ఈ కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. 
 
అయితే, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఏవీ సుబ్బారెడ్డి వాదిస్తున్నారు. ఏ1గా ఎందుకు చేర్చారో కూడా అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. ప్రవీణ్‌తో విభేదాలు వచ్చినవి వాస్తవమే అన్న సుబ్బారెడ్డి.. మిస్ కమ్యూనికేషన్ కారణంగా తన పేరు తెర మీదకొచ్చిందన్నారు. 
 
గతంలో తనను చంపడానికి సుపారీ ఇచ్చిన అఖిల ప్రియతో తానెందుకు కిడ్నాప్‌కు ప్లాన్ చేస్తానని ఆశ్యర్యం వ్యక్తం చేశారు. హఫీజ్‌పేట వ్యవహారంలోనే కిడ్నాప్ చేశారా లేక వ్యక్తిగత కారణాలతోనే కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తే అసలు నిజాలు బయటపడుతాయన్నారు. 
 
అయినప్పటికీ, పోలీసులు సుబ్బారెడ్డిని ఏ1గానే పరిగణించి అరెస్ట్ చేయడంతో బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. కాగా, ఇదే కేసులో టీడీపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియా రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త భార్గవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments