Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకుకు తాళం మ‌రిచితిరి, దొంగా దొంగా అని అరిచితిరి

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (16:25 IST)
మ‌నం ఎక్కిడికైనా వెళితే, ఇంటికి తాళం సరిగా వేశామా?  లేదా అని ఒకటికి ప‌ది సార్లు చెక్ చేసుకుంటాం. కానీ, ఏకంగా బాంకుకే తాళం వేయ‌డం మ‌రిచిపోయారు ఇక్క‌డ సిబ్బంది. పైగా ఉద‌యాన్నే వ‌చ్చి త‌లుపులు తెరిచి ఉన్నాయ‌ని, దొంగ‌లు ప‌డ్డార‌ని కంప్ల‌యింట్ ఇచ్చారు. అంతా చెక్ చేసి... ఎంత‌టి మ‌హానుభావులు బాబూ మీరు అని పోలీసులు త‌ల‌లు ప‌ట్టుకున్నారు.
 
ప్రకాశంజిల్లా కనిగిరిలో ఈ ఘటన జ‌రిగింది. కనిగిరిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్యం కాసేపు అంద‌రినీ హ‌డ‌లించింది. సోమ‌వారం సాయంత్రం బాంకుకు తాళాలు వేయడం మరిచిన సిబ్బంది, ఉదయం వచ్చి చూసే సరికి తాళాలు తీసి ఉండటాన్నిగమనించి...  చోరీ జరిగినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప‌రుగు ప‌రుగున వ‌చ్చిన పోలీసులు తీరా, దొంగ‌ల ఆచూకి కోసం సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించారు. చివ‌రికి ఏ దొంగా రాలేదు...కేవ‌లం బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యమేనని తేల్చిన చెప్పారు పోలీసులు. ముందు రోజు తాళం వేయ‌కుండా అజాగ్ర‌త్త‌గా సిబ్బంది వెళ్లిపోయార‌ని, త‌ర్వాతి రోజు వ‌చ్చి తాళాలు తెరిచి ఉన్నాయ‌ని కంప్ల‌యింట్ చేశార‌ని ఓ నిట్టూర్పు విడిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

Mrunal Thakur: ధనుష్‌తో ప్రేమాయణంపై మృణాల్ ఏమందంటే..? తప్పుగా..?

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments