Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణానదిలో మునిగి ఐదుగురు విద్యార్థుల మృతి

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (10:20 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం 13-15 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు విద్యార్థులు కృష్ణానదిలో మునిగి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
 
ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని, మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మండల రెవెన్యూ అధికారి సతీష్ కుమార్ తెలిపారు.
 
యెనమలకుదురు సమీపంలో నదిలో స్నానానికి ఏడుగురు విద్యార్థులు నదికి వెళ్లిన సమయంలో మధ్యాహ్నం ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. 
 
ఇద్దరు బాలురు ఈదుకుంటూ సురక్షితంగా వెళ్లగా, మిగిలిన పిల్లలు మునిగిపోయారు. స్థానిక ఈతగాళ్లు, మత్స్యకారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
 
మృతులు విజయవాడలోని పటమటలంకకు చెందిన బాలు, కమేష్, మున్నా, షేక్ బాజీ, హుస్సేన్‌గా గుర్తించారని, స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8, 9 తరగతుల విద్యార్థులుగా పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments