Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో కోవిడ్ కేర్ సెంటరులో అగ్నిప్రమాదం...

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం స్వర్ణ హోటల్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది వరకు కరోనా రోగులు చనిపోయారు. 
 
ఈ ఘటన మరువకముందే ఇపుడు విశాఖపట్టణంలో మరో ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి విశాఖపట్నం మారికవలస గ్రామంలోని మరో క్వారంటైన్‌ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
ఈ అగ్నిప్రమాదంపై పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల మారికివలస శ్రీ చైతన్య జూనియర్ కళాశాల గ్రౌండ్ ఫ్లోర్‌, మొదటి అంతస్తులో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే మూడో అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కరోనా రోగులను పక్కనే ఉన్న మరో భవనంలోకి తరలించారు. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కేంద్రంలో మొత్తం 64 మంది కరోనా రోగులు ఉండగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments