Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి ఓట్ల లెక్కింపు కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎవరి పని?

Webdunia
మంగళవారం, 21 మే 2019 (12:19 IST)
ఈ నెల 23వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తుండగా అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగింది.

అయితే, ఈ ప్రమాదం వల్ల ఈవీఎంలు భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదనీ, ఓట్ల లెక్కింపు యధావిధిగా జరుగుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదంపై వైకాపా, టీడీపీ నేతలు పలు అనుమానాలు వెల్లడిస్తున్నారు. ఈ పని చేసింది వైకాపా నేతలు అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. కాదు టీడీపీ నేతలేనంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.
 
మరోవైపు, ఈ దఫా ఎన్నికల పోటీలో టీడీపీ తరపున దివంగత ఎమ్మెల్యే వెంకట రమణ భార్య ఎం సుగుణమ్మ పోటీలో వుంటే వైకాపా తరపున భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 
 
నిజానికి గత 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎం.వెంకటరమణ కొద్ది కాలానికే చనిపోవడంతో ఆయన భార్య ఎం.సుగుణను ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. వైసీపీ పోటీ పెట్టకపోవడంతో ఆమె లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. పోటీ తీవ్రంగానే ఉండనున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments