Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదవడం లేదనీ ఐదేళ్ళ బిడ్డను కొట్టి చంపిన తల్లి...

Webdunia
మంగళవారం, 21 మే 2019 (12:12 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లాలో దారుణం జరిగింది. చదవడం లేదని ఐదేళ్ల బిడ్డను కొట్టి చంపిందో కసాయి తల్లి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుచ్చి జిల్లా కాట్టుపుదూర్, పల్లివాసల్ గ్రామానికి చెందిన నిత్యకమలం (35), పాండ్యన్ (37) అనే దంపతులకు లతికా శ్రీ (5) అనే ఐదేళ్ళ కుమార్తె ఉంది. ఈమె స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో ఒకటే తరగతి చదువుతోంది. అయితే, ఇంటికి వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి ఆటలకే పరిమితమవడం, పొద్దస్తమానం టీవీకి అతుక్కునిపోయి చదవడం లేదని పేర్కొంటూ లతికాశ్రీని తల్లి నిత్యకమలం తీవ్రంగా కొట్టింది. 
 
దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. చనిపోయినట్టు నిర్ధారించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి.. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలులోకి వచ్చింది. బిడ్డ చదవడం లేదన్న ఆగ్రహంతో కొట్టానని, ఆ దెబ్బలను తాళలేక పాప స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు చెప్పింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments