Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణిగుంటలో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. వైద్యుడు మృతి

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:51 IST)
తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ ఆస్పత్రి యజమాని అయిన డాక్టర్ రవిశంకర్ రెడ్డి మంటల్లో సజీవదహనమయ్యాడు. ఇద్దరు పిల్లలు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డారు. ఆయన భార్య, అత్త మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. 
 
రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనీలో కార్తికేయ పేరుతో డాక్టర్ రవిశంకర్ రెడ్డి ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. ఇదే ఆస్పత్రి భవనంపైన రవిశంకర్ రెడ్డి కుటుంబం నివసిస్తుంది. ఆదివారం ఉదయం వైద్యుడి కుటుంబం నివాసం ఉంటున్న అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
ఈ మంటలను గుర్తించిన స్థానికులు పోలీసులతో పాటు అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే, మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రవిశంకర్ రెడ్డి భార్య, అత్తను కాపాడారు. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది మంటలను అదుపు చేసి అతి కష్టంమీద రవశంకర్ రెడ్డి 12 యేళ్ల కుమారుడు, భరత్, కుమార్తె కార్తీక (15)ను రక్షించారు. 
 
వీరందరినీ తిరుపతిలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరూ కన్నుమూశారు. రవిశంకర్ రెడ్డి మంటల్లోలే కాలిబూడిదైపోయాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments