Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణిగుంటలో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. వైద్యుడు మృతి

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:51 IST)
తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ ఆస్పత్రి యజమాని అయిన డాక్టర్ రవిశంకర్ రెడ్డి మంటల్లో సజీవదహనమయ్యాడు. ఇద్దరు పిల్లలు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డారు. ఆయన భార్య, అత్త మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. 
 
రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనీలో కార్తికేయ పేరుతో డాక్టర్ రవిశంకర్ రెడ్డి ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. ఇదే ఆస్పత్రి భవనంపైన రవిశంకర్ రెడ్డి కుటుంబం నివసిస్తుంది. ఆదివారం ఉదయం వైద్యుడి కుటుంబం నివాసం ఉంటున్న అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
ఈ మంటలను గుర్తించిన స్థానికులు పోలీసులతో పాటు అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే, మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రవిశంకర్ రెడ్డి భార్య, అత్తను కాపాడారు. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది మంటలను అదుపు చేసి అతి కష్టంమీద రవశంకర్ రెడ్డి 12 యేళ్ల కుమారుడు, భరత్, కుమార్తె కార్తీక (15)ను రక్షించారు. 
 
వీరందరినీ తిరుపతిలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరూ కన్నుమూశారు. రవిశంకర్ రెడ్డి మంటల్లోలే కాలిబూడిదైపోయాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments