రేణిగుంటలో ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. వైద్యుడు మృతి

Webdunia
ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (09:51 IST)
తిరుపతి జిల్లా రేణిగుంటలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ ఆస్పత్రి యజమాని అయిన డాక్టర్ రవిశంకర్ రెడ్డి మంటల్లో సజీవదహనమయ్యాడు. ఇద్దరు పిల్లలు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డారు. ఆయన భార్య, అత్త మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. 
 
రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనీలో కార్తికేయ పేరుతో డాక్టర్ రవిశంకర్ రెడ్డి ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. ఇదే ఆస్పత్రి భవనంపైన రవిశంకర్ రెడ్డి కుటుంబం నివసిస్తుంది. ఆదివారం ఉదయం వైద్యుడి కుటుంబం నివాసం ఉంటున్న అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
ఈ మంటలను గుర్తించిన స్థానికులు పోలీసులతో పాటు అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే, మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రవిశంకర్ రెడ్డి భార్య, అత్తను కాపాడారు. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది మంటలను అదుపు చేసి అతి కష్టంమీద రవశంకర్ రెడ్డి 12 యేళ్ల కుమారుడు, భరత్, కుమార్తె కార్తీక (15)ను రక్షించారు. 
 
వీరందరినీ తిరుపతిలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరూ కన్నుమూశారు. రవిశంకర్ రెడ్డి మంటల్లోలే కాలిబూడిదైపోయాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments