Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ 2.O : కొత్త మంత్రివర్గం ఇదే...

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (17:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మంత్రి మండలిని ప్రభుత్వం ఆదివారం అధికారికంగా వెల్లడించింది. పాత, కొత్త కలయికతో మొత్తం 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వీరిలో నగరి ఎమ్మెల్యే ఆర్కే. రోజాకు లక్కీ ఛాన్స్ దక్కింది. 2024లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ కూర్పును సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 
 
ఇప్పటికే నూతన మంత్రుల జాబితా గవర్నర్ వద్దకు వెళ్లింది. సీఎం పేషీ నుంచి కొత్త మంత్రులకు ఫోన్‌లు వెళ్లాయి. ఫోన్‌ రావడంతో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ విజయవాడ బయల్దేరారు. కొత్త, పాత మంత్రులకు సీఎం పేషీ నుంచి ఫోన్‌లు వెళ్లాయి. మరికొందరికి జీఏడీ నుంచి ఫోన్‌లు వచ్చాయి. సోమవారం ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 
 
కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారిలో శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, రాజన్నదొరలకు చోటు కల్పించారు. 
 
అలాగే, విశాఖపట్టణం నుంచి గుడివాడ అమర్నాథ్‌, ముత్యాలనాయుడు, తూర్పుగోదావరి నుంచి దాడిశెట్టిరాజా, విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పశ్చిమ గోదావరి నుంచి తానేటి వనిత, కారుమూరి నాగేశ్వర రావు, కొట్టు సత్యనారాయణలకు చోటు కల్పించారు. 
 
పాత మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామిని మళ్లీ చోటు కల్పించారు. అలాగే, ఆర్కే. రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడుదల రజనీ, కాకాని గోవర్థన్ రెడ్డి, అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషా శ్రీ చరణ్, తిప్పేస్వామిలకు చోటు కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments