Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరాదాగా పేకాట.. రూ.500ల కోసం గొడవ.. హత్య.. అతడి భార్య గర్భవతి?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (14:45 IST)
సరదాగా పేకాట ఆడుకుందామని వెళ్లిన స్నేహితుల మధ్య గొడవ వచ్చింది. డబ్బుల విషయంలో ఘర్షణ పడి ఒక వ్యక్తిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. హకీంపేటకు చెందిన మహ్మద్‌ జావిద్‌ పాషా(26) ఒక ఆటోడ్రైవర్‌. అతనికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. అతని భార్య ఇప్పుడు గర్భవతి.


మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన షేక్‌ సాజిద్‌, ఇంతియాజ్‌, నిజాం, సయ్యద్‌ అనే స్నేహితులతో కలిసి పేకాట ఆడటానికి జియా పాఠశాల వెనుక ఉన్న గుట్టల్లోకి వెళ్లాడు. 
 
ఆ సమయంలో వారు మద్యం తాగారు. పేకాటలో జావిద్‌ 500 రూపాయలు గెలుచుకున్నాడు. అయితే డబ్బు విషయంలో స్నేహితుల మధ్య రచ్చ వచ్చింది. దాదాపు రాత్రి 11.30 సమయంలో ఇంతియాజ్‌‌తో కలిసి స్నేహితులందరూ జావిద్‌‌పై దాడికి దిగి తీవ్రంగా కొట్టారు. ఈ తోపులాటలో బాధితుడు రాయిపై పడ్డాడు. తీవ్రంగా గాయపడటంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 
 
వెంటనే హకీంపేటలోని ఆల్‌నూర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో నానల్‌నగర్‌లోని ఆలివ్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. సోదరుడు షేక్‌ జహంగీర్‌ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం