Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరాదాగా పేకాట.. రూ.500ల కోసం గొడవ.. హత్య.. అతడి భార్య గర్భవతి?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (14:45 IST)
సరదాగా పేకాట ఆడుకుందామని వెళ్లిన స్నేహితుల మధ్య గొడవ వచ్చింది. డబ్బుల విషయంలో ఘర్షణ పడి ఒక వ్యక్తిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. హకీంపేటకు చెందిన మహ్మద్‌ జావిద్‌ పాషా(26) ఒక ఆటోడ్రైవర్‌. అతనికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. అతని భార్య ఇప్పుడు గర్భవతి.


మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన షేక్‌ సాజిద్‌, ఇంతియాజ్‌, నిజాం, సయ్యద్‌ అనే స్నేహితులతో కలిసి పేకాట ఆడటానికి జియా పాఠశాల వెనుక ఉన్న గుట్టల్లోకి వెళ్లాడు. 
 
ఆ సమయంలో వారు మద్యం తాగారు. పేకాటలో జావిద్‌ 500 రూపాయలు గెలుచుకున్నాడు. అయితే డబ్బు విషయంలో స్నేహితుల మధ్య రచ్చ వచ్చింది. దాదాపు రాత్రి 11.30 సమయంలో ఇంతియాజ్‌‌తో కలిసి స్నేహితులందరూ జావిద్‌‌పై దాడికి దిగి తీవ్రంగా కొట్టారు. ఈ తోపులాటలో బాధితుడు రాయిపై పడ్డాడు. తీవ్రంగా గాయపడటంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 
 
వెంటనే హకీంపేటలోని ఆల్‌నూర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో నానల్‌నగర్‌లోని ఆలివ్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. సోదరుడు షేక్‌ జహంగీర్‌ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం