Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో పిల్లల గొంతు కోసిన తండ్రి... ఆపై తానుకూడా...

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (15:53 IST)
గుంటూరు జిల్లాలో విషాదం జరిగింది. మద్యం మత్తులో తన ఇద్దరు పిల్లల గొంతులను కోశాడు. ఆపై తాను కూడా ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన తాడేపల్లికి చెందిన రమణమూర్తి(35) చిలకలూరిపేటలో నివాసం ఉంటున్నాడు. లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆస్తి విషయంలో కొంత కాలంగా అత్తవారింటితో విరోధం ఏర్పడింది. తరచూ తగువు పడుతుండేవారు. మద్యానికి బానిసై భార్యను కూడా వేధిస్తుండేవాడు. 
 
ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ బుధవారం సాయంత్రం గొడవపడ్డారు. భార్య కోపంతో పుట్టింటికి వెళ్లి పోయింది. నిన్న రాత్రి ఫుల్లుగా తాగి ఇంటికొచ్చిన రమణమూర్తి తన పిల్లలు భవాని నాగదినేశ్‌(8), సాయి(6)ని కత్తితో గొంతు కోసి చంపాడు. ఆపై తాను కూడా ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments