Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాహసీల్దార్ ఎదుట గొంతు కోసుకున్న రైతు

ఠాగూర్
మంగళవారం, 20 ఆగస్టు 2024 (16:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్ తాహసీల్దార్ కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యకు యుత్నించారు. తాహసీల్దార్ ఎదుటే తన గొంతు తాను కోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. ఎవరూ ఊహించని ఘటనతో ఇది కలకలం రేపింది. గత 15 యేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు తన సమస్యను పరిష్కరించలేదంటూ తారాకపురం గ్రామానికి చెందిన గడ్డం సుంకన్న అనే రైతు ఈ చర్యకు పాల్పడ్డారు. ఆ వెంటనే స్పందించిన తాహసీల్దారు కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి రైతును హుటాహుటిన బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 
 
ఈ ఘటనపై బాధిత రైతు మాట్లాడుతూ, కల్లుదేవనహళ్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 6.68 ఎకరాల భూమిని 1974లో తమ తండ్రి లింగప్ప కొనుగోలు చేశారని, ఇందులో శాంతకుమార్ ఒక ఎకరా, నరసింహులు అనే వ్యక్తి 1.5 ఎకరా కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై న్యాయం చేయాలని కోరుతూ 15 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. పైగా తమపైనే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కింద కేసు నమోదు చేయించారని వాపోయారు. 
 
ఈ విషయమై బొమ్మనహాళ్​ తహసీల్దార్ మునివేలు స్పందిస్తూ, రైతు సుంకన్న కార్యాలయం లోపలికి రాలేదన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చిన వెంటనే బయట ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వెల్లడించారు. రైతు సుంకన్న వద్ద భూమికి సంబంధించిన ఎలాంటి రికార్డులు గాని, ఆధారాలు కానీ లేవని, భూ సమస్యపై రైతులు గత కొన్నాళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో సర్వేయర్ భూమి కొలతలు చేయడానికి వెళ్లిన సమయంలో కూడా రైతు సుంకన్న ఆత్మహత్యకు యత్నించినట్లు వివరించారు. ఇప్పుడు రెండోసారీ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments