Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రచారంలో జగన్ బిజీ బిజీ.. సీన్‌లోకి సీఎం సతీమణి భారతి.. షర్మిల?

సెల్వి
శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (15:33 IST)
Bharathi Vs Sharmila
తెలుగుదేశం, జనసేన, బీజేపీల సమష్టి పోరును ఎదుర్కొనేందుకు వైకాపా సిద్ధం అయ్యింది. ఈ ఏడాది అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు చారిత్రక ప్రాధాన్యత కలిగినవని సీఎం వైఎస్‌ జగన్‌ పదే పదే పేర్కొంటున్నారు. కాబట్టి, జగన్ ప్రస్తుతం సుదీర్ఘ బస్సు యాత్రలో ఉన్నందున తన ఎన్నికల ప్రచారంపై ఎక్కడా రాజీ పడట్లేదు. అందుకే బహిరంగ సభల్లో మాట్లాడేందుకు వెనక్కి తగ్గట్లేదు. 
 
జగన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో బిజీగా ఉండడంతో సొంతగడ్డ పులివెందులలో జోరు పెంచుతోంది. ఆ లోటును పూడ్చేందుకు జగన్ భార్య భారతి పులివెందులలో తన భర్త తరపున ఇంటింటి ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
 
అయితే అదే సమయంలో వైఎస్ షర్మిల కూడా పులివెందుల, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. షర్మిల కడపలో బస్సుయాత్ర ప్రారంభించి కడప పార్లమెంటు సెగ్మెంట్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని చాటుకున్నారు. 
 
ఇంకేముంది, తన అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు పులివెందులకు రావచ్చు. ముఖ్యంగా, షర్మిల, భారతి ఇద్దరూ కడపలో ర్యాలీ చేస్తారు. ఇందులో జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల ఓటు వేయొద్దంటూ.. జగన్ సతీమణి భారతి తన భర్తకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు. 
 
2019లో కూడా ఆమె ఎన్నికల ప్రచారానికి భారతి కొత్తేమీ కాదు. జగన్‌కు పులివెందుల ఫార్మాలిటీ సీటు అని, ఇక్కడ ఎప్పుడూ రికార్డు మెజారిటీతో గెలుస్తారని వైకాపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments