Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పెన్షన్ డబ్బుల పంపిణీలో నకిలీ నోట్ల కలకలం

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (15:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి ఒకటో తేదీన అర్హులైన వృద్ధులకు ప్రభుత్వం వృద్ధాప్య పింఛను డబ్బులను పంపిణీ చేసింది. వలంటీర్లు శనివారమే డబ్బులు విత్ డ్రా చేసుకుని ఆదివారం ఉదయం నుంచి ఈ పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే, ఈ పింఛను డబ్బుల్లో నకిలీ నోట్లు కనిపించాయి. ఇవి కలకలం సృష్టిస్తున్నాయి. 
 
రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం నరసాయపాళెం గ్రామంలో 38 రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి పెంచిన పింఛన్లు ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. దీంతో భాగంగా, నరసాయపాళెం గ్రామం ఎస్సీ కాలనీలో వాలంటీర్ పింఛను పంపిణీ చేసేందుకుగాను శనివారం యర్రగొండపాళెంలోని ఓ బ్యాంకులో డబ్బును డ్రా చేశాడు. 
 
ఆదివారం ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేసి వెళ్లిన తర్వాత నకిలీ నోట్లు ఉన్నట్టు లబ్ధిదారులు గుర్తించి వలంటీరుకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత అతని వద్ద ఉన్న డబ్బుల్లో కూడా నకిలీ నోట్లు ఉన్నట్టు గ్రహించాడు. అలా మొత్తం రూ.19 వేలు విలువ చేసే రూ.500 నకిలీ నోట్లను గుర్తించిన వలంటీరు అధికారులకు అప్పగించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులో నకిలీ నోట్లు ఎలా వచ్చాయన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments