Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో ఐదు పైసలకే బిర్యానీ.. ఎగబడిన స్థానికులు!

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (14:55 IST)
ఉచితంగా లేదా డిస్కౌంట్ ధరలకు ఏదేనీ వస్తువు విక్రయిస్తున్నారంటే జనాలు ఎగబడతారు. అయితే, కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏపీలోని నంద్యాలలో ఓ వ్యాపారి ఐదు పైసలకే బిర్యానీ అందించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ బిర్యానీ కోసం ఎగబడ్డారు. పాతకాలం నాటి ఒక పైసా లేదా ఐదు పైసలు నాణెం ఇస్తేనే బిర్యానీ ఫ్రీ అని ప్రకటించి షరతు పెట్టాడు. అయినప్పటికీ పాత నాణేలతో వందలాది మంది ప్రజలు బిర్యానీ కోసం తరలివచ్చారు. 
 
యువకులు, మహిళలు, చిన్నారులు భారీ సంఖ్యలో తరలి రావడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ కారణంగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. చివరకు పోలీసుల ఆదేశంతో నిర్వాహకులు రెస్టారెంట్‌ను మూసివేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఈ తరహా ప్రకటన చేసినందుకు రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు పెడతామని డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments