Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ తెలుగు విద్యార్థులను మేం చూసుకుంటాం పవన్ గారూ, ఫోన్‌లో కేంద్రమంత్రి

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (10:53 IST)
భారతదేశం నుంచి ఉన్నత విద్య కోసం యూకే వెళ్ళిన 300 మంది విద్యార్థులు కరోన విస్తృతితో తీవ్ర భయాందోళనలో ఉన్నారని.. వారిని ఆదుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి శ్రీ ఎస్.జైశంకర్‌కు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి స్పందించారు. పవన్ కళ్యాణ్‌తో ఫోన్లో మాట్లాడారు.
 
అక్కడ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు తగిన సౌకర్యాలను అందిస్తామని తెలిపారు. విద్యార్థినీవిద్యార్థుల వివరాలను తమకు పంపిచాలనీ, వారి వివరాలు అందిన తర్వాత సత్వరమే సహాయచర్యలకు ఉపక్రమిస్తామని తెలియజేశారు.
 
కరోనా వైరస్ విజృంభణ నేపధ్యంలో స్వదేశానికి వచ్చేయడానికి ప్రయత్నించిన ఆ విద్యార్థులు యూకే విమానాశ్రయాల్లో, లండన్ లోని హై కమిషన్ ఆఫ్ ఇండియాలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. గత 12 రోజులుగా వారికి సరైన ఆహారం, వసతి లేక ఇబ్బందులుపడుతున్నారు. వీరి సమస్యను పవన్ కళ్యాణ్ కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments