Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'జనసేనాని'కి తెలంగాణ గవర్నర్ ప్రశంసలు.. శభాష్ అంటూ ట్వీట్

'జనసేనాని'కి తెలంగాణ గవర్నర్ ప్రశంసలు.. శభాష్ అంటూ ట్వీట్
, మంగళవారం, 31 మార్చి 2020 (10:57 IST)
జనసేనాని, టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభినందనలు తెలిపారు. అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామిని కూడా ఆమె అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. వారిద్దరికీ గవర్నర్ అభినందనలు తెలపడానికి కారణం లేకపోలేదు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామం నుంచి 30 మంది మత్స్యకారులు తమిళనాడు తీర ప్రాంతానికి చేపల వేటకు వెళ్లారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా వారంతా చెన్నై హార్బ‌ర్‌లో చిక్కుకు పోయారు. ఈ విష‌యం తెలుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌త్య్య‌ుకారులు అక్క‌డ వ‌స‌తి, భోజ‌న స‌దుపాయాలు లేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, వారికి త‌గు స‌దుపాయాలు కల్పించాల‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామికి విజ్జప్తి చేస్తూ లేఖ రాశారు.
 
పవన్ కళ్యాణ్ వినతిపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తక్షణం స్పందించారు. సంబంధిత అధికారులకు అదేశాలకు ఆదేశాలుజారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఏపీ మత్స్యకారులకు తగిన సదుపాయాలను కల్పించారు. మ‌త్స్యకారుల ఇబ్బందుల‌ను నివారించ‌డానికి త‌న వంతు పాత్ర‌ను పోషించిన ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ను, అందుకు తగినట్లు స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందర్‌రాజన్ అభినందిస్తూ ట్విట్ట‌ర్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలా చేయగలిగితే మీకు కరోనా లేనట్టా? లేనట్టా?