Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజధాని అమరావతే.. అధైర్యం వద్దు : మంత్రి కిషన్ రెడ్డి

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (12:28 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతేనని, అందువల్ల ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆయన సికింద్రాబాద్‌లో గృహ సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ సమయంలో అమరావతి రైతులు, మహిళలు అక్కడకు వచ్చి ఓ వినతి పత్రం సమర్పించారు. 
 
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారని.. దానిని అక్కడే కొనసాగించాలని, తమను కాపాడాలని కిషన్‌ రెడ్డి కాళ్లుపట్టుకుని ప్రాధేయపడ్డారు. దీంతో భావోద్వేగానికిలోనైన మంత్రి కిషన్ రెడ్డి... పైవిధంగా భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం చేస్తానన్నారు. దీంతో రైతులు, మహిళలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విభిన్న ప్రకటనల వల్లే ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. 'రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చినప్పుడు వారికి ధైర్యం చెప్పి, అండగా ఉండాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నవారిపై ఉంటుంది. రైతుల నుంచి ఇప్పటికే భూముల సేకరణ జరిగింది. పార్టీలు, ప్రభుత్వం కలిసి చర్చించుకోవాలి. ఉద్రిక్త వాతావరణం నెలకొనడం మంచిది కాదు' అని హితవుపలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments