Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ వాసిగా రాజధానిని ఎలా వద్దంటాను : గంటా శ్రీనివాస రావు

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (12:08 IST)
విశాఖవాసిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందంటే తాను ఎందుకు వద్దంటానని మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను స్వాగతించకుండా ఉండలేనని స్పష్టం చేశారు. 
 
నిజం చెప్పాలంటే విశాఖపట్టణ నగరం ఆర్థికంగా ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిందన్నారు. కానీ, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే మరిన్ని వనరులు లభిస్తాయన్నారు. అందువల్ల విశాఖ నగరానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇస్తామంటే ఎలా వద్దంటానని చెప్పారు. 
 
ఇకపోతే, అమరావతి నుంచి రాజధానిని తరలించిన తర్వాత అక్కడి రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిదేనని గంటా స్పష్టం చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా చేయడాన్ని సమర్థిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి, ఈ తీర్మాన ప్రతిని పార్టీ అధినేత చంద్రబాబుకు పంపినట్టు గంటా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments