Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడిని చూసేందుకు వెళితే... పట్టుకుని అత్యాచారం చేశారు...

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (09:25 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తన స్నేహితుడిని చూసి మాట్లాడి వచ్చేందుకు వెళితే ముగ్గురు కామాంధులు కలిసి ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణం చిత్తూరు జిల్లా కురబలకోటలో జరిగింది. ఈ నెల 3వ తేదీన ఈ దారుణం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కురబలకోట మండల కేంద్రానికి చెందిన ఓ యువతి ఇంజనీరింగ్ చదువుతోంది. ఆమె ఈ నెల 3వ తేదీ సాయంత్రం తన స్నేహితుడిని కలిసేందుకు హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లింది. 
 
ఆమె తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో అదే ప్రాంతానికి కొందరు యువకులు మద్యం సేవించేందుకు వచ్చారు. ఈ తాగుబోతు యువకులు ఆ యువతిపై కన్నేసి.. దాడి చేశారు. ఆమె స్నేహితుడిని కొట్టి బెదిరించి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ముగ్గురూ కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో ఆ యువతి మిన్నకుండిపోయింది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆ యువతి అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత వారంతా కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచారానికి పాల్పడిన కమతంవారిపల్లెకు చెందిన అష్రఫ్, జయచంద్ర, మస్తాన్‌వల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments