Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడిని చూసేందుకు వెళితే... పట్టుకుని అత్యాచారం చేశారు...

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (09:25 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తన స్నేహితుడిని చూసి మాట్లాడి వచ్చేందుకు వెళితే ముగ్గురు కామాంధులు కలిసి ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణం చిత్తూరు జిల్లా కురబలకోటలో జరిగింది. ఈ నెల 3వ తేదీన ఈ దారుణం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కురబలకోట మండల కేంద్రానికి చెందిన ఓ యువతి ఇంజనీరింగ్ చదువుతోంది. ఆమె ఈ నెల 3వ తేదీ సాయంత్రం తన స్నేహితుడిని కలిసేందుకు హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లింది. 
 
ఆమె తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో అదే ప్రాంతానికి కొందరు యువకులు మద్యం సేవించేందుకు వచ్చారు. ఈ తాగుబోతు యువకులు ఆ యువతిపై కన్నేసి.. దాడి చేశారు. ఆమె స్నేహితుడిని కొట్టి బెదిరించి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ముగ్గురూ కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో ఆ యువతి మిన్నకుండిపోయింది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆ యువతి అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత వారంతా కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచారానికి పాల్పడిన కమతంవారిపల్లెకు చెందిన అష్రఫ్, జయచంద్ర, మస్తాన్‌వల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments