Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడిని చూసేందుకు వెళితే... పట్టుకుని అత్యాచారం చేశారు...

Webdunia
శుక్రవారం, 23 ఆగస్టు 2019 (09:25 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తన స్నేహితుడిని చూసి మాట్లాడి వచ్చేందుకు వెళితే ముగ్గురు కామాంధులు కలిసి ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణం చిత్తూరు జిల్లా కురబలకోటలో జరిగింది. ఈ నెల 3వ తేదీన ఈ దారుణం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కురబలకోట మండల కేంద్రానికి చెందిన ఓ యువతి ఇంజనీరింగ్ చదువుతోంది. ఆమె ఈ నెల 3వ తేదీ సాయంత్రం తన స్నేహితుడిని కలిసేందుకు హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లింది. 
 
ఆమె తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో అదే ప్రాంతానికి కొందరు యువకులు మద్యం సేవించేందుకు వచ్చారు. ఈ తాగుబోతు యువకులు ఆ యువతిపై కన్నేసి.. దాడి చేశారు. ఆమె స్నేహితుడిని కొట్టి బెదిరించి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ముగ్గురూ కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో ఆ యువతి మిన్నకుండిపోయింది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆ యువతి అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత వారంతా కలిసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచారానికి పాల్పడిన కమతంవారిపల్లెకు చెందిన అష్రఫ్, జయచంద్ర, మస్తాన్‌వల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments