Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మున్సిపల్ పోల్స్ : మంత్రి ఆళ్ళ నాని ఓటు గల్లంతు

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (16:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ నాని ఓటు గల్లంతు అయింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఎన్నికల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ ఎన్నికల్లో భాగంగా, మంత్రి ఆళ్ళ నాని తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏలూరులోని శనివరపుపేటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి రాగా, ఓటర్ల జాబితాలో తన పేరు లేదని తెలుసుకుని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా తయారీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. 
 
దీంతో పోలింగ్ బూత్ సిబ్బంది క్షుణ్ణంగా 20 నిమిషాల పాటు తనిఖీ చేయగా, ఆయన ఓటరు నంబరుపై ఓ మహిళ పేరు నమోదైవున్నట్టు గుర్తించారు. దీంతో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. 
 
కాగా, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు పోలింగ్ నిర్వహించాలని మంగళవారం హైకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. అయితే, ఎన్నికలు నిర్వహించినప్పటికీ... ఫలితాలను మాత్రం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు వెల్లడించవద్దని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments