Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎం ధ్వంసం : వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు ఈసీ ఆదేశం

ఠాగూర్
బుధవారం, 22 మే 2024 (13:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన జరిగిన పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన అధికార వైకాపా మాచర్ల  ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు. మాచర్లలో పోలింగ్ తర్వాత చోటుచేసుకున్న హింసాంత్మక సంఘటనల తర్వాత పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. 
 
ఈవీఎం ధ్వంసం కేసులో ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఎందుకు ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదని మండిపడింది. పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనపై సాయంత్రం 5 గంటల లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు ఆదేశాలు జారీచేసింది. ఈవీఎం ధ్వంసం ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ పెట్టిన ట్వీట్‌ను ఈసీ ప్రస్తావించింది. 
 
మరోవైపు, మాచర్ల నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం 202లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్టు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రం 202తో పాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో ఫుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఈసీ.. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments