Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటర్ గుర్తింపు - ఆధార్ కార్డుల అనుసంధానానికి కేంద్రం పచ్చజెండా!

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (19:19 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు అనుసంధానికి పచ్చజెండా ఊపినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలోనే ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను అనుసంధానం చేసే ప్రక్రియను ఈసీ ప్రారంభించనుంది. 
 
ఆధార్ నంబరుతో ఓటరు గుర్తింపు కార్డును అనుసంధానం చేసే అంశంపై చర్చించి, కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం మంగళవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో కేంద్ర హోం శాఖ కార్యదర్శి, శాసన వ్యవహారాల కార్యదర్శి, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుల సాంకేతిక నిపుణులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
ఈ రెండు గుర్తింపు కార్డులను అనుసంధానం చేయడం వల్ల దొంగ ఓట్లను నమోదు చేయడానికి వీలుండదు. ఆధార్ కార్డుతో ఓటరు కార్డును అనుసంధానమైతేనే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. దీనివల్ల దొంగ ఓట్లు, రిగ్గింగ్ వంటిని జరగకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు ఎన్నికల సంఘానికి వీలుపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments