Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పుల తడకే : తమిళనాడీ సీఎం పళనిస్వామి

Webdunia
సోమవారం, 20 మే 2019 (15:07 IST)
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి మండిపడ్డారు. ఈ ఫలితాలన్నీ తప్పుల తడకేనని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలను డీఎంకే స్వీప్ చేస్తుందని ఈ ఫలితాలు వెల్లడించాయి. ఒక్క వేలూరు మినహా మిగిలిన 38 సీట్లలో డీఎంకేకు 27 నుంచి 34 సీట్లు వస్తాయని వివిధ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి 11 వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి.
 
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధాలే అని ఆయన అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్నాడీఎంకే కూటమి మొత్తం 39 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
 
2014 సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే, వాటి అంచనాలను తలకిందులు చేస్తూ అన్నాడీఎంకే ఏకంగా 37 సీట్లను కైవసం చేసుకుని... అందరికీ షాక్ ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments