ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాం : ఈడీ దూకుడు

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (16:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇందులోభాగంగా, మాజీ ఛైర్మన్, డైరెక్టరుతో సహా 26 మందికి నోటీసులు పంపించారు. ఇలా నోటీసులు పంపించిన వారివద్ద సోమవారం నుంచి విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన నిధుల్లో రూ.234 కోట్ల మేరకు నిధులను మళ్లింపునకు సంబంధించిన ఈడీ కేసు నమోదు చేసింది. 
 
ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావులతోపాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ అయింది. వీరి వద్ద సోమవారం నుంచి హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయంలో విచారణ జరుగనుంది.
 
కాగా, ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ పేరుతో నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన కోసం గతంలో చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దుర్వినియోగం అయినట్టు గుర్తించిన ప్రస్తుత సీఎం జగన్ ప్రభుత్వం సీఐడీ విచారణకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని భావించిన సీఐడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈడీ ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై దృష్టిసారించి, లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments