Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాం : ఈడీ దూకుడు

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (16:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇందులోభాగంగా, మాజీ ఛైర్మన్, డైరెక్టరుతో సహా 26 మందికి నోటీసులు పంపించారు. ఇలా నోటీసులు పంపించిన వారివద్ద సోమవారం నుంచి విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన నిధుల్లో రూ.234 కోట్ల మేరకు నిధులను మళ్లింపునకు సంబంధించిన ఈడీ కేసు నమోదు చేసింది. 
 
ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ, మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావులతోపాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ అయింది. వీరి వద్ద సోమవారం నుంచి హైదరాబాద్ నగరంలోని ఈడీ కార్యాలయంలో విచారణ జరుగనుంది.
 
కాగా, ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ పేరుతో నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన కోసం గతంలో చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దుర్వినియోగం అయినట్టు గుర్తించిన ప్రస్తుత సీఎం జగన్ ప్రభుత్వం సీఐడీ విచారణకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని భావించిన సీఐడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈడీ ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై దృష్టిసారించి, లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments