Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చంపేట ట్రాన్స్‌కో స‌బ్‌స్టేష‌న్‌లో అగ్నిప్రమాదం - రూ.కోట్లలో ఆస్తి నష్టం

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (09:33 IST)
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ ప్రాంతంలోని అచ్చంపేట సమీపంలో ఉన్న 220/132 కేవీ ట్రాన్స్‌కో స‌బ్‌స్టేష‌న్‌లో 160 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మ‌ర్ వ‌ద్ద భారీ అగ్నిప్ర‌మాదం సంభవించింది. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. 
 
అగ్ని ప్రమాదం కారణంగా జిల్లాలోని కోన‌సీమ‌, రామ‌చంద్రాపురం, కాకినాడ ప్రాంతాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. 
 
ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా బీమ‌వ‌రం, న‌ర్సాపురం నుంచి కోన‌సీమ‌కు, రామ‌చంద్రాపురానికి బొమ్మూరు నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రా ఏర్పాట్లు చేశారు. కాకినాడ‌కు పెద్దాపురం నుంచి విద్యుత్ స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు చేశారు. 
 
ప్ర‌మాదం జ‌రిగిన అర‌గంట‌లోనే విద్యుత్ స‌ర‌ఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ చేశారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించివుంటుందని అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments